పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం..
అర్హుల కు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాల న్నదే ప్రభుత్వ సంకల్పం..
రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడతాం.
స్టీల్ బ్యాంక్ లతో ప్లాస్టిక్ కు చెక్
స్వచ్ఛ గ్రామాల అంశంలో దేశానికే తెలంగాణ ఆదర్శం
చెరువులు నిండినా ఒక్కటి కూడా తెగలేదంటే అది మిషన్ కాకతీయ ఘనతే
గుర్రాల గొంది లో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం కార్యక్రమంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు..
సమృద్ధిగా వర్షాలు కురవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్లే జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 3484 చెరువులను గానూ ఇప్పటి వరకూ 3 వేల పైగా చెరువులు నిండు కుండలను తలపిస్తూ మత్తడి దుంకుతున్నాయ నీ మంత్రి తెలిపారు. దశాబ్దాల తర్వాత
చెరువులన్నీ నిండడం తో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ రైతులు, మత్య కారులు అనందంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
సోమవారం నారాయణ పేట మండలం గుర్రాల గొంది గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ తో కలిసి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
రెండు పడక గదుల ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడా రు.
కాళేశ్వరం జలాలు, సమృద్ధిగా వర్షాలు తో చెరువులన్నీ దాదాపుగా నిండయాన్నారు. ఇలా అన్ని చెరువులు నిండుతాయని ప్రజలెవరూ కలలో కూడా ఊహించలేదు అని అన్నారు.
జిల్లాలో చాలా వరకు చెరువులు నిండిన ఒక్క చెరువు తెగలెదంటే అందుకు కారణం మిషన్ కాకతీయ అని అన్నారు.
ముందు చూపుతో చెరువులన్నీ బలో పెతం చేసుకోవడం వల్లే ఇది సాధ్య పడిందన్నారు.
గుర్రాల గొంది పెద్ద రాయిని చెరువు కూడ నిండి గత 2 నెలలుగా మత్తడి దుంకు తుందన్నారు. కోమటి చెరువును పెద్ద రాయిని చెరువు తలపిస్తుంద న్నారు.
పెద్ద రాయిని చెరువును సుందరీకరణ చేస్తామన్నారు.
గుర్రాల గొంది గ్రామ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ గా అవార్డ్ దక్కించుకున్నదని… ఇది గ్రామ ప్రజల ఘనతే అన్నారు. మునుముందు కూడ ఇదే స్ఫూర్తితో పనిచేసి మరిన్నీ అవార్డులు చేజిక్కించు కోవాలన్నారు. ప్లాస్టిక్ ను సమూలంగా నిర్మూ లించెందుకు గుర్రాల గొంది గ్రామంలో స్టీల్ బ్యాంక్ ను ఏర్పాటు చేశామన్నారు. రూ. 3 కోట్ల 50 లక్షలతో అదనంగా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో ఆధునిక వ్యవసాయ గోదాం ను నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.12 లక్షలతో లక్ష్మీ నరింహస్వామి దేవాలయం పునరుద్ధరణ చేపడుతున్నా మన్నారు. కొత్తగా మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
గుర్రాల గొంది గ్రామంలో 36 రెండు పడక గదుల ఇండ్ల ను లబ్దిదారులకు అందజేశా మన్నారు. అర్హులకు మాత్రమే అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు.
రైతుల కు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వానాకాలం పంట కు సంబంధించి రైతు బంధు క్రింద పంట పెట్టుబడి సహాయం క్రింద ఎకరాకు 5 వేల చొప్పున ఆర్థిక సహాయం ను రైతు ఖాతాలో జమ చేశామన్నారు. యాసంగీ పంట ను మొత్తము ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందన్నారు. పల్లెలను స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దేందుు ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంక్, సెగ్రీ గేషన్ , డంప్ యార్డు, వైకుంఠ ధామం, ప్రకృతి వనం ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టా మన్నారు. పల్లెల స్వచ్ఛత అంశంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
కార్యక్రమంలో చైర్మన్ శ్రీ రవీందర్ రెడ్డి, స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.