గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయభూముల వద్ద, బావులకాడి ఇండ్లు, ఫామ్హౌజ్లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్లైన్లో ఉచితంగా మ్యుటేషన్ (ఎన్రోల్) చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు.
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నవారికి దేశంలోనే తొలిసారిగా పట్టాదార్ పాస్పుస్తకం జారీచేయనున్నట్టు తెలిపారు. మెరూన్ కలర్లో ప్రత్యేకంగా రూపొందించిన పాస్పుస్తకాలను అందజేస్తామని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులకు పూర్తిరక్షణ కల్పించాలన్నదే కొత్త రెవెన్యూ చట్టం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. భూవివాదాలు, ఘర్షణలను నివారించి ప్రజల ఆస్తులకు పక్కాహక్కులు కల్పించేందుకే ఈ పాస్పుస్తకాలు జారీచేస్తున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూచట్టం అమలు, ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.