పవన్కల్యాణ్ సరసన సాయిపల్లవి నటించనున్నారా? అంటే… ‘అవును’ అనే సమాధానం సినీ వర్గాల నుండి వినబడుతోంది. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.
అందులో శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రను పవన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రలో సాయిపల్లవి నటించనున్నారని వినికిడి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.
ఈ చిత్రంలో పవన్తో పాటు మరో కథానాయకుడికి చోటుంది. అందులో రానా దగ్గుబాటి నటిస్తారని తొలుత వినిపించింది. ఇప్పుడు నితిన్, కన్నడ కథానాయకుడు ‘కిచ్చా’ సుదీప్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
చివరికి, ఎవరు నటిస్తారనేది చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించాలి. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. పి.డి.వి. ప్రసాద్ సమర్పకులు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు.