గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బాగంగా మల్లాపూర్ లోని గుల్మోర్ అపార్ట్ మెంట్స్ లో 5వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్ది పన్నాల దేవెందర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..ఈ సందర్బంగా అపార్ట్ మెంట్ మొత్తం తమ ఓటు టీఆర్ఎస్ అభ్యర్దికే అంటూ ఏకగ్రీవ తీర్మాణం చేసారు..
టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని వారు తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్దికి తెలుపుతున్నట్టు వారు ఎమ్మెల్యే సమక్షంలో ప్రకటించారు…ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు..దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమాభివృద్ది చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో,యువనేత ఐటీ&పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్ గారి ముందుచూపు,పనితనంతో హైదరాబాద్ కు పెట్టుబడుల వెల్లువ వస్తుందన్నారు.యువతకు ఉద్యోగ,ఉపాది అవకాశాలు లబిస్తున్నాయన్నారు..కాంగ్రేస్,బీజేపీలకి ఓట్లు సీట్లు తప్ప తెలంగాణా సోయి లేదని,నాటి నుండి నేటి వరకు తెలంగాణా కోసమే పనిచేస్తున్న టీఆర్ఎస్ ను గెలిపించాలని ఎమ్మెల్యే నరేందర్ కోరారు..ఈ కార్యక్రమంలో అపార్ట్ మెంట్ వాసులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు..