ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్మోడల్గా నిలిచిందని గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ పేర్కొన్నారు. అతితక్కువ వయసున్న యంగ్ స్టేట్గా తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని అభినందించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో తెలంగాణ రైస్బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందని కొనియాడారు.
వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ మిగతా రాష్ర్టాలకంటే ముందువరుసలో నిలుస్తున్నదని ప్రశంసించారు.
ఐటీ, ఔషధ, లైఫ్సైన్సెస్ కంపెనీలకు హబ్గా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ.. వెనుకబాటుతనాన్ని అధిగమించి శరవేగంగా బంగారు తెలంగాణ నిర్మాణంవైపు అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించారు.