తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. ఇప్పుడు తెలుగులో విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తుంది.
భారీ చిత్రాల్లో నటిస్తున్న సాయిపల్లవి ఓ ఎక్స్పెరిమెంట్కు తెర తీస్తుందట. తమిళంలో చేయబోయే ఓ సినిమాలో సాయిపల్లవి కమెడియన్ సరసన నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సమాచారం మేరకు తమిళంలో కమెడియన్గా పేరు తెచ్చుకున్న కాళి వెంకట్ జోడీగా సాయిపల్లవిని నటింప చేయడానికి నిర్మాతలు, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరి సాయిపల్లవి అందుకు ఓకే చెబుతుందా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ఆమె ఓకే అంటే, నిజంగా గొప్ప విషయమే.