భారత్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెయిమ్ ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 3.7శాతం పచ్చదనాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు.
సోల్హెయిమ్ నార్వే అంతర్జాతీయ అభివృద్ధిశాఖ మంత్రి గా, పర్యావరణశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు.
తెలంగాణ పచ్చదనాన్ని ప్రశంసించిన సోల్హెయింకు రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జే సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘనత భవిష్యత్ తరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించడానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుకు దక్కుతుందని ట్వీట్ చేశారు.