టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో సమంత అక్కినేని లీడ్ రోల్ పోషిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
శాకుంతలంలో వరంగల్ అమ్మడు ఈషా రెబ్బా కీ రోల్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈషారెబ్బ శాకుంతలం ప్రాజెక్టుకు నుంచి తప్పుకున్నట్టు న్యూస్ ఫిలింసర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
తన రోల్కు మేకర్స్ ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ పట్ల అసంతృప్తితో ఉన్న ఈషా..ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈషారెబ్బ నుంచి ప్రకటన వస్తే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈషా ఇటీవలే విడుదలైన నెట్ఫ్లిక్స్ ప్రాజెక్టు పిట్టకథలు తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంతోపాటు తమిళంలో ఓ సినిమాలో నటించింది.