Home / SLIDER / మాజీ మంత్రి ఈటెల డొల్ల‌త‌నాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన మంత్రి గంగుల

మాజీ మంత్రి ఈటెల డొల్ల‌త‌నాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన మంత్రి గంగుల

మాజీ మంత్రి క‌భ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజెంద‌ర్ పై రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువ‌త చేరిన కార్య‌క్ర‌మంలో గంగుల క‌మ‌లాక‌ర్ పాల్గొని వారికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ తెలంగాణ‌ను ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపిస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప వ్య‌క్తిని ఇష్టానుసారంగా అనుచిత వాఖ్య‌లు చేస్తే ప్ర‌తీ తెలంగాణ బిడ్డ తిర‌గ‌బ‌డ‌తాడ‌ని దీటుగా బ‌దులిచ్చారు. కేసీఆర్ వ‌ద్ద ఉన్న‌ప్పుడు ఆత్మ‌గౌర‌వంతో ఈటెల, ఇప్పుడు త‌న ఆత్మ‌గౌరవంతో పాటు తెలంగాణ బిడ్డ‌లైన హుజురాబాద్ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని డిల్లీ చెట్ల‌కింద తాక‌ట్టు పెట్టాడ‌ని, కేవ‌లం ఆస్థులు కాపాడుకోవ‌డం కోసం నీచంగా డిల్లీ పెద్ద‌ల‌కు గులామ్ అయ్యాడ‌ని మండిప‌డ్డారు. బిజేపీలో చేరిన త‌ర్వాత తొలిసారి హుజురాబాద్ వ‌చ్చిన ఈటెల కేసీఆర్ కు ఘోరీ క‌డుతామ‌ని చేసిన వాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపారు గంగుల‌. స‌మైక్య పాల‌నలో అరిగోస ప‌డుతున్న తెలంగాణ‌ని విముక్తి చేసిన కేసీఆర్, బంగారు తెలంగాణ కోసం అహ‌ర్నిష‌లు క్రుషిచేస్తున్నార‌ని, దేశంలో ఎక్క‌డాలేని విదంగా రైతుబందు, రైతుబీమా, 24గంట‌ల ఉచిత క‌రెంట్, బిసి, ఎస్సీ,ఎస్టీ అణ‌గారిన వ‌ర్గాల బంగారు భ‌విష్య‌త్ కోసం గురుకులాలు, అవ్వ అయ్యా ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌ని ఆస‌రా ఫించ‌న్లు ఇంకా ఎన్నో ప‌థ‌కాలు అందిస్తున్నందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ఘోరీ క‌ట్టాలా అని ప్ర‌శ్నించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌రిగ‌ల‌కు తీసేసే ఈటెల రాజెంద‌ర్ కు రాబోయే హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఘోరీ క‌డుతార‌ని, ఆయ‌న చేసిన అక్ర‌మాల‌ని ప్ర‌శ్నిస్తార‌ని అన్నారు గంగుల.

ఆర‌వై ఏళ్ల ఆత్మ‌గౌర‌వ పోరుతో సాధించిన తెలంగాణ క‌న్నా స‌మైక్య పాల‌నే బాగుంద‌నే త‌న అభిప్రాయాన్ని ఈటెల త‌న భార్య జ‌మున‌తో చెప్పించార‌ని. ఇంత‌కన్నా దౌర్బాగ్యం ఉంటుందా అని దునుమాడారు. స‌మైక్య‌మే ముద్ద‌న్న ఈటెల‌ను చేర్చుకున్న బీజేపీ ఈ విష‌యంలో త‌మ వైఖ‌రి ఏంటో బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేసారు. తెలంగాణ మెత్తం గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి నాయ‌క‌త్వంలో ముందుకు పోతే తామంతా అడిగిన వెంట‌నే నిదులిచ్చి మా నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివ్రుద్ది ప‌థంలో నిలుపుకున్నామ‌ని, కానీ ఈటెల ఏనాడు హుజురాబాద్ని ప‌ట్టించుకోలేద‌ని, కేవ‌లం త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే మాట్లాడి హుజురాబాద్ని అభివ్రుద్దిలో వెనుక‌కు నెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు. హుజురాబాద్లో ఏవిద‌మైనా అభివ్రుద్ది జ‌ర‌గ‌లేద‌ని సీఎం కేసీఆర్ కు చెప్పిన వెంటనే నిదులు మంజూరు చేశార‌ని గుర్తుచేసారు గంగుల‌. ఖ‌చ్చితంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ని అభివ్రుద్ది ప‌థంలో తీసుకెల్తుంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ దీన్ని గ‌మ‌నించార‌ని ఎక్క‌డికి పోయినా వారి వ‌ద్ద‌నుండి మంచి మ‌ద్ద‌తు ల‌బిస్తుంద‌ని ఆనందం వ్య‌క్తం చేసారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. రాబోయే ఉపఎన్నిక‌లే టీఆర్ఎస్ కు, కేసీఆర్ గారికి ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ తెలియ‌జేస్తాయ‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ని విద్యార్థి సంఘాల నాయకులు TNSF పార్లమెంట్ ఇంచార్జ్ టేకుల. శ్రవణ్, AIYF కరీంనగర్ జిల్లా కార్యదర్శి లంకదాసరి. కళ్యాణ్ ,AISB రాష్ట్ర కార్యదర్శి కొలుగురు. సూర్య కిరణ్ ,హుజురాబాద్ BJYM నాయకులు దొడ్డిపెళ్లి, రాకేష్ వీరి తో పాటుగా నియోజకవర్గంలో ని విద్యార్థి,యువజన సంఘాల నాయకులు సుమారు 100 మంది ఈరోజు జిల్లా గౌరవ మంత్రి గంగుల. కమలాకర్ గారు సమక్షంలో చేరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో లో కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు గారు హుజురాబాద్ మున్సిపాలిటీ మాజీ. చేర్మెన్ వడ్లూరి. విజయ్ కుమార్ గారు.TRSV రాష్ట్ర మాజీ కార్యదర్శి మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మొలుగు. పూర్ణ చందర్. TRSV జిల్లా ప్రధాన కార్యదర్శి పోతారవేని అనిల్ విద్యార్థులు,యువకులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat