Home / SLIDER / వాసా‌ల‌మ‌ర్రిలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

వాసా‌ల‌మ‌ర్రిలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌పల్లి మండ‌లం‌లోని వాసా‌ల‌మ‌ర్రిలో పర్య‌టిం‌చ‌ను‌న్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత ద‌ళిత వాడ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ వాడ‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం కేసీఆర్.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో పాటు ద‌ళితుల‌ స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం.. గ్రామ‌మంతా క‌లియ తిరుగుతూ పారిశుద్ధ్య చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించ‌నున్నారు.

అనం‌తరం రైతు వేదిక భవ‌నంలో ఏర్పా‌టు‌చే‌సిన సమా‌వే‌శంలో గ్రామా‌భి‌వృ‌ద్ధిపై గ్రామ‌స్థు‌లతో చర్చిం‌చ‌ను‌న్నారు. గత పర్య‌టన సంద‌ర్భంగా తాను చేసిన పలు సూచ‌నల అమ‌లు‌తీ‌రుపై ఈ సంద‌ర్భంగా సీఎం సమీ‌క్షిం‌చ‌నున్నారు. తదు‌పరి చేప‌ట్టా‌ల్సిన కార్యా‌చ‌ర‌ణపై ప్రజా‌ప్ర‌తి‌ని‌ధులు, అధి‌కా‌రులు, ప్రజ‌లకు దిశా‌ని‌ర్దేశం చేస్తారు.

వాసాల‌మ‌ర్రి గ్రామా‌నికి సీఎం కేసీ‌ఆర్‌ రావడం ఇది రెండో‌సారి. కాగా, గత జూన్‌ 22న తొలి‌సా‌రిగా వాసా‌ల‌మ‌ర్రికి వచ్చిన ముఖ్య‌మంత్రి.. గ్రామ‌స్థు‌లతో కలిసి గ్రామా‌భి‌వృ‌ద్ధిపై చర్చించి అనం‌తరం సహ‌పంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరో‌సారి గ్రామా‌నికి వ‌చ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat