హిందువులు పవిత్రంగా భావించే స్థలాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచిన త్రిషపై చర్యలు తీసుకోవాలని హిందూ విద్యా మండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ డిమాండ్ చేస్తున్నారు. హరికేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు.
దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణ ప్రస్తుతం నర్మదా నదీ ఒడ్డున ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోంది. శివలింగాలు, నందీశ్వరుడు సహా పలు దేవతామూర్తులు కోలువై ఉన్న చోట కార్తీ, రెహమాన్, త్రిషలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
అక్కడికి త్రిష చెప్పులు ధరించి వెళ్లడం వివాదాస్పదమైంది. ఆమెతో పాటు దర్శకుడు మణిరత్నంపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో దినేశ్ కట్టోర్ పేర్కొన్నారు.