మహబూబాబాద్ నుండి గూడూరు పర్యటనకు వెళుతున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు మార్గ మధ్యలో జగన్ నాయకులగూడెం ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వాగతం పలకగా… ఎమ్మెల్యే వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తమ గ్రామంలో సమస్యలను ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యే శంకర్ నాయక్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం తో పాటు, మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని, సమస్యల పరిష్కారానికే శంకర్ నాయక్ ఉన్నాడని… మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదేనంటూ.. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలంతా హర్షధ్వానాలు చేశారు.