యాదగిరిగుట్ట తరహాలోనే వేములవాడ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఆయన చెప్పారు. అధికారులతో వేములవాడ ఆలయ పరిసరాలను ఆనందసాయి పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి తరహాలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్త కలిసి ఆలయాన్ని పరిశీలిస్తానని.. మరో 15 రోజుల్లో రాజన్న ఆలయ అభివద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తానని ఆనందసాయి తెలిపారు. తాజాగా ఉద్ఘాటన జరిగిన యాదాద్రి ఆలయ పనులను ఆనందసాయి ఆధ్వర్యంలోనే చేపట్టారు. ఆ పనులను విజయవంతంగా పూర్తిచేసిన నేపథ్యంలో రాజన్న ఆలయ అభివృద్ధి బాధ్యతలను కూడా ఆయనకే కేసీఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది.