సూర్య, టి.జె జ్ణానవేల్.వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జై భీమ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది నవంబర్లో నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది.
గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రూ పాత్రలో సూర్య నటన ప్రశంసనీయం. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మరోసారి చేతులు కలుప నుంది. ఈ విషయాన్ని స్వయంగా జ్ణానవేల్ వెల్లడించాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. దీనిపై సూర్య అభిమానులను సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫార్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.