Home / ANDHRAPRADESH / చిరంజీవి ఫ్యాన్స్‌కు నాగబాబు బ్లాక్‌మెయిల్‌: వెలంపల్లి

చిరంజీవి ఫ్యాన్స్‌కు నాగబాబు బ్లాక్‌మెయిల్‌: వెలంపల్లి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏపీకి పనికిరాని వ్యక్తి అని.. చిరంజీవి లేకపోతే పవన్‌ ఎవరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్‌ లేనిదే పవర్ స్టార్‌ ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు.

ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మెగా బ్రదర్‌, జనసేన నేత నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. నాగబాబుకి విధివిధానాలు లేవని.. చిరంజీవి ఫ్యాన్స్‌ మొత్తం జనసేనకి సపోర్ట్‌ చేయాలని చెప్పడం ఆయన్ను అవమానించడమేనన్నారు. చిరంజీవి ఫ్యాన్స్‌ను నాగబాబు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని వెలంపల్లి ఆరోపించారు.

చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని బీజేపీతో పవన్‌ టచ్‌లో ఉన్నాడని విమర్శించారు. ఆ పార్టీ వాళ్లు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్‌.. ఓ ఒక్క రోజైనా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేశారా? అని వెలంపల్లి నిలదీశారు. మొదట అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ తీసుకుని పవన్‌కల్యాణ్‌ మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat