పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ తన ప్రెస్మీట్లో చూపించిన ఫొటోలు, వీడియోలపైనా పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ ఘటనపై జూబ్లీహిల్స్లో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
రఘునందన్ చూపించిన ఫొటోలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. నిందితుల ఫొటోలు, వీడియోలు ఆయనకు ఎలా చేరాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. మీడియాలో బాధితురాలి ఫొటోను ప్రసారం చేయొద్దని ఇప్పటికే డీసీపీ జోయల్ డేవిస్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది మైనర్లు, యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్గా ఉంది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.