సీఎం జగన్ తీసుకున్న చొరవతో 1998 డీఎస్సీ అభ్యర్థుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఇటీవల ఎంపిక జాబితాను ప్రభుత్వం ప్రకటించగా అందులో వైసీపీకి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చేసిన ఆయన.. సుమారు పాతికేళ్ల క్రితం డీఎస్సీ రాశారు. వివిధ కారణాలతో 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఇన్నాళ్లూ నిరీక్షణ తప్పలేదు.
ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో ధర్మశ్రీ పేరు ఉండటంతో మీడియా ప్రతినిధులు ఆయన్ను కలవగా.. అప్పటి పరిస్థితులను పంచుకున్నారు. టీచర్గా స్థిరపడాలనుకుని బీఈడీ పూర్తిచేసి 1998లో డీఎస్సీ రాశానని చెప్పారు. అర్హత సాధించినా అది పెండింగ్లో ఉండిపోవడంతో బీఎల్ చేశాననని.. అదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి శిష్యుడిగా ఉంటూ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని కరణం ధర్మశ్రీ చెప్పుకొచ్చారు.