ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము తన నిరాడంబరతను చాటుకున్నారు. తన స్వస్థలంలో ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా రాయ్రంగ్పూర్.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన నేపథ్యంలో ఆమె అక్కడి శివాలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను ఊడ్చారు. ఇప్పటికే గవర్నర్, మంత్రి, ఎమ్మెల్యే పదవులు చేపట్టిన ముర్ము.. ఈ విధంగా సింప్లిసిటీ చాటుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.