క్యాసినో కేసులో నిర్వాహకులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈడీ తనిఖీల సమయంలో మాధవరెడ్డి కారుకు మేడ్చల్ ఎమ్యెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్న అంశం చర్చనీయాంశమైంది.
బోడుప్పల్లో ఓ స్కూల్కు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంశంపై స్పందించారు. అది మార్చి 2022 నాటి స్టిక్కర్ అని.. దాన్ని మూడునెలల క్రితమే తీసి బయటపడేశామన్నారు. బయటపడేసిన స్టిక్కర్ను ఎవరో కారుకి పెట్టుకుంటే తనకు సంబంధమేంటని ఆయన తిరిగి ప్రశ్నించారు.