ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫస్టియర్ స్టూడెంట్స్ను సుమారు 20 మంది సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం జూనియర్ల హాస్టల్లోకి వెళ్లి వారి డ్రెస్సులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు.
మద్యం తాగాలని ఒత్తిడి చేయడం, సీనియర్ల హోంవర్క్ చేయిండం లాంటివి చేశారు. దీంతో ఓ విద్యార్థి ఈనెల 25న ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్కు కంప్లైంట్ చేయడంతో విషయం బయటకి వచ్చింది. దీనిపై ఓ కమిటీని నియమించిన విశ్వవిద్యాలయం అధికారులు.. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా 20 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.
వారిలో తీవ్ర ఆరోపణలు ఉన్న ఏడుగురిని ఓ సెమిస్టర్ పాటు క్లాస్ల నుంచి.. డిగ్రీ పూర్తయ్యే వరకు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. మరో 13 మందిని హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.