Home / MOVIES / ఇక్కడ ఎవరూ ఎవర్ని తొక్కరు.. బలిపశువుల్ని చేయొద్దు: దిల్‌రాజు

ఇక్కడ ఎవరూ ఎవర్ని తొక్కరు.. బలిపశువుల్ని చేయొద్దు: దిల్‌రాజు

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలమంతా యూనిటీగానే ఉంటామని.. తమ మధ్య ఎప్పూడూ హెల్దీ కాంపిటీషనే ఉంటుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఆయన నిర్మాతగా రూపొందిన ‘థాంక్యూ’ సినిమా కోసం నిఖిల్‌ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమాను తొక్కేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దిల్‌ రాజు స్పందించారు. కార్తికేయ 2 సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు.

క్లిక్స్‌ కోసం, వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు రాయొద్దని కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి దిల్‌రాజు హితవు పలికారు.టాలీవుడ్‌లో ఎవరి సినిమా ఆడినా తామంతా ఆనందపడతామని చెప్పారు. ఒక్క సినిమా సక్సెస్‌ అయితే తమకు ఇంకో సినిమా తీయడానికి ఊపిరి పోస్తుందన్నారు. అంతేకానీ తమలో తమకు ఏదో క్రియేట్‌ చేసి మమల్ని బలిపశుల్ని చేయొద్దని కోరారు. వాస్తవాలు తెలిస్తే రాయాలని.. తెలియకపోతే తెలుసుకొని రాయాలని సూచించారు.

డబ్బు నష్టపోయి కూడా ఎన్నో సినిమాలు విడుదల చేశానని దిల్‌ రాజు గుర్తుచేసుకున్నారు. సినిమా కోసం తాను ప్రాణం ఇస్తానన్నారు. దిల్ రాజు సినిమాను తొక్కేస్తున్నాడు అంటూ ఏవేవో రాసేశారని.. ఇక్కడ ఎవరూ ఎవరి సినిమానూ తొక్కరని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat