Home / ANDHRAPRADESH / చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి తాగిన మత్తులో..!

చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి తాగిన మత్తులో..!

కర్నూలు జిల్లా ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆర్థరాత్రి చేసిన ఓ పనికి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. అభంశుభం తెలియని పసిపిల్లల్ని ఊరి బయట చిమ్మ చీకట్లో ఒంటరిగా విడిచిపెట్టేశాడు. అంతేకాకుండా భార్యను సృహా కోల్పోయేలా కొట్టి వేరే చోట వదిలేశాడు.

కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణ, సుజాత భార్యభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు. ఒక కూతురు, నలుగురు కొడుకులు. తాగుడుకి బానిసైన కృష్ణ అనుమానంతో నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. సోమవారం కూడా తాగి ఆమెతో గొడవపెట్టుకున్నాడు. మద్యం మత్తులో సుజాత, ఇద్దరు మహేంద్ర(5), బంటు(3)లను ఆటోలో ఊరి చివరికీ తీసుకెళ్లాడు. ఓ ప్రదేశంలో ఆగి భార్యతో మళ్లీ గొడవపడి ఆమెను సృహా కోల్పోయేలా కొట్టి అక్కడే వదిలేశాడు. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వేరే ఊరిలో ఉన్న కాలువ గట్టు వద్ద వదిలేశాడు. రాత్రాంతా పిల్లలు చిమ్మ చీకట్లో చలికి వణుకుతూ ఏడుస్తూ ఉండిపోయారు. పొద్దున్న అటుగా వచ్చిన ఓ రైతు పిల్లల ఏడుపు విని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హైవే పోలీసులు అక్కడికి చేరుకొని పిల్లల్ని అక్కున చేర్చేకున్నారు. పిల్లలు తన తల్లి గురించి చెప్పగా అక్కడకి వెళ్లి ఆమెను రక్షించారు. మంగళవారం కృష్ణను పోలీసులు స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని అప్పగించారు. కృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat