హైదరాబాద్లోని ఓ డీమార్ట్లో కుళ్లిన ఖర్జూరం విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై కుషాయిగూడలోని న్యూవాసవీ శివానగర్ పరిధిలోని డీమార్ట్లో సంతోష్ అనే వ్యక్తి ఖర్చూరం పండ్ల ప్యాకెట్ కొనుగోలు చేశాడు.
డీమార్ట్లో ఉండగానే అతడి నాలుగేళ్ల కుమారుడు ఖర్చూరం కావాలని అడిగాడు. దీంతో సంతోష్ ప్యాకెట్ తెరిచి చూడగా.. అందులో పురుగులు, బూజుతో పాటు దుర్వాసన వచ్చింది. దీంతో డీమార్ట్ యాజమాన్యానికి దాన్ని చూపించాడు. ఖర్చూర కంపెనీకి ఈ విషయాన్ని చెప్తామని.. వాళ్లే సమాధానమిస్తారని తెలిపారు. మేనేజ్మెంట్ సమాధానం సంతృప్తికరంగాలేకపోవడంతో కాప్రా డీఎంహెచ్వోకు సంతోష్ ఫిర్యాదు చేశాడు.
దీంతో అధికారులు అక్కడికి చేరుకుని ఖర్చూరంతో పాటు అక్కడ ఉన్న పప్పు దినుసులను కూడా పరిశీలించారు. కొన్ని పుచ్చుపట్టి ఉండటంతో డీమార్ట్ మేనేజ్మెంట్కు రూ.30వేల ఫైన్ వేశారు. ఎంతో నమ్మకంతో డీమార్ట్కు వచ్చే ప్రజలకు నాణ్యమైన వస్తువులు ఇవ్వకుండా ఇలా మోసం చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.