గుజరాత్లోని ఓ తల్లిదండ్రులకు వింత అనుభవం ఎదురైంది. కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ స్థానికులు తల్లిదండ్రులను అడ్డగించారు. బాలుడు గట్టిగా అరుస్తూ.. వారితో గొడవ పడటమే ఇందుకు కారణం. పోలీసులు రంగంలోకి దిగి వారి ఇంటికి వెళ్లి అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత వారు తల్లిదండ్రులే అని నిర్ధారించారు.
వడోదవరకు చెందిన ఓ జంట సోమవారం తమ 5ఏళ్ల కొడుకుతో ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్లో వెళ్తున్నారు. అప్పటికే బాలుడు పెద్దగా అరుస్తూ తల్లిదండ్రులపై చిరాకు పడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే వారి వాహనాన్ని అడ్డుకున్నారు. బాబుని కిడ్నాప్ చేస్తున్నారా? అని గట్టిగా నిలదీశారు. దీంతో బాబు మా కన్న కొడుకే అని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. బాలుడు వారు మా అమ్మానాన్నలే అని చెప్తాడు అనుకుంటే ఆ బాబు బధిరుడు. దీంతో ఏం మాట్లాడలేడు. ఈ కారణంగా జనాలు నమ్మలేదు. పెద్దగా ఆ ప్లేస్లో గుమిగూడి వారిని పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
ఘటనాస్థలాన్ని చేరుకున్న పోలీసులకు తల్లిదండ్రులు మా కొడుకే అని చెప్పారు. ఇక్కడి వారు మేము మా కొడుకునే దొంగతనం చేస్తున్నామని మమ్మల్ని అడ్డగించారని వాపోయారు. పోలీసులు వారి ఇంటికి వెళ్లి తగిన ఆధారాలు చూసి వారే తల్లిదండ్రులని నిర్దారించారు. ఇందుకు దాదుపు రెండు గంటలు టైం పట్టింది.