తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని గురువారం ఆయన ఇంటి వద్ద ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొడుకు రాజేశ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో ఆయన్ను హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ కేసులో అయ్యన్న మొదటి నిందితుడిగా, విజయ్ను రెండో నిందితుడిగా, రాజేశ్ మూడో నిందితుడిగా ఉన్నారు. ఈరోజు వేకువ జామున ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు చుట్టిముట్టి.. గోడ దూకి వారి ఇంట్లోకి వెళ్లి అయ్యన్నకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు.