Political తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే పర్యటనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అక్కడ పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు..
పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం కేంద్రం భరించాలని చట్టంలో ఉంటే.. గతంలో రాష్ట్రం ఎందుకు నెత్తిన వేసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పోలవరం ప్రాజెక్టును తాము నిర్మిస్తాం.. మీరు డబ్బులివ్వండి’ అని గత ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబునాయుడు కచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే అని అన్నారు..
అలాగే 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తామని శాసనసభలో బల్లగుద్ది సవాల్ చేసి చెప్పారని, మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం ఎలా చేశారన్నారు. ఇది చారిత్రక తప్పిదం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ మూడింటికి సమాధానం చెప్పిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించాలంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. అప్పట్లో అన్ని మాటలు మాట్లాడ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎలాంటి పురోగతి చూపించలేదని మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏ రకంగా విమర్శిస్తారు అంటూ ప్రశ్నించారు ఎన్నో ఏళ్లకు సాగుతున్న పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేని సంగతి తెలిసిందే ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నప్పటికీ ఈ విషయంలో ఎలాంటి పురోగతికి కనిపించడం లేదు..