Political తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అందరూ కలిసి మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. అందరూ ఏకమై కేసీఆర్ను టార్గెట్ చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు..
కెసిఆర్ ను మానసికంగా దెబ్బతీసే రాజకీయాల్లో వెనక్కి నెట్టాలని అందరూ కలిసి ప్రయత్నిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.. సీఎం కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ గుత్తా సుఖేందర్రెడ్డి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. సమైక్యవాదులు కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.. ఏడాది నుంచి తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక.. సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని అన్నారు. ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో బీజేపీ దత్త పుత్రిక షర్మిల..కేసీఆర్ను అప్రతిష్టపాలు చేస్తోస్తుదని మండిపడ్డారు గుత్తా సుఖేందర్రెడ్డి. అలాగే బీజేపీ విసిరిన బాణం షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్ను పరువు తీస్తోందని ఆరోపించారు…అలాగే కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఎలాంటి అరాచకాలు లేకుండా పాలన సాగుతోందన్నారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజల కోసం ఎంతో చేసిందని ఆ విషయం ప్రజలు కచ్చితంగా గ్రహిస్తున్నారని అన్నారు.. కానీ కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు గుత్తా సుఖేందర్రెడ్డి. అవినీతికి పాల్పడి వారు జైలుకు వెళ్లడమే కాకుండా..IAS అధికారులను సైతం జైలుకు పంపించారని విమర్శలు గుప్పించారు..