JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధానిగా విశాఖ ఉండనుందని వ్యాఖ్యానించారు. దిల్లిలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు.
విశాఖ….ఏపీకి కొత్త రాజధాని కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధులంతా విశాఖ రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. త్వరలో తాను కూడా విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆకాంక్షించారు.
ఏప్రిల్ లోపే విశాఖ నుంచి పాలన జరుగుతుందని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలున్నాయని అన్నారు. మరీ అవసరమైతే ప్రైవేటు భవనాలను కూడా తీసుకోవచ్చని తెలిపారు. సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.