MINISTER SATYAVATHI: ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు–మన బడిలో కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
కేసీఆర్ సర్కారు…. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. మన ఊరు–మన బడి…..మొదటి విడతలో ప్రతి మండలానికి 4 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
విద్యార్థులకు తాగునీటి వసతితోపాటు మరుగుదొడ్లు, వంటశాలల నిర్మాణం చేపట్టిందన్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు భోజనాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. సర్కారు బడుల అభివృద్ధికి ప్రభుత్వం 7వేల200 కోట్లు రూపాయలు మంజూరు చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మార్చేందుకు కేసీఆర్ సర్కారు…. మన ఊరు–మన బడి కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల విద్య కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.