Minister Ktr తాజాగా అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తమ వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందని ఈ బిజెపి వాళ్లు అంటారేమో అంటూ తెలిపారు.
దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్అర్ సినిమాలో నాటు నాటు పాట ఒరిజినల్ విభాగంలో ఆస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు పలువురు మంత్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మోడీ సైతం హర్షం వ్యక్తం చేస్తూ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాట రాసిన చంద్రబాబు తో పాటు ఎం ఎం కీరవాణి తారక చరణకు ఈయన శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. రాజమౌళికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో బీజేపీపై కౌంటర్ వేశారు.
ఆర్ఆర్అర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై స్పందించిన కేటీఆర్.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా తెలుగుజాతి గర్వించాల్సిన క్షణాలు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన రోజు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయాన్ని కూడా బిజెపి వాళ్లు తమ ఖాతాలోనే వేసుకుంటారేమో.. అలాగే ఆస్కార్ రావడం మోడీ దయ అంటూ చెప్పుకొస్తారు అంటూ వ్యంగంగా స్పందించారు..