Minister Ktr తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈడీకు భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటన్నిటికీ భయపడేది దొంగలేనని తాము ఏ మాత్రం భయపడమని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని ఎన్నాళ్లలో దేశాన్ని బ్రస్టు పట్టించిందని చెప్పారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరు నీతిమంతులు ఎవరు అవినీతిపరులు ప్రజలే తేలుస్తారని అన్నారు కెసిఆర్ ను మూడోసారి ప్రజలు సీఎంగా ఎన్నుకోవాలని అప్పుడే నీతిమంతులు ఎవరో తెలుస్తుందని చెప్పుకొచ్చారు అలాగే ఇలాంటి ఈడి విచారణలకు భయపడమని కేవలం అడ్డదారుల్లో దొంగ పనులు చేసే వారు మాత్రమే వాటికి భయపడతారని తాము అందుకు అతీతం అని చెప్పుకొచ్చారు.
అలాగే ఎన్నికలు రాగానే కాంగ్రెస్ బిజెపిలు వస్తాయని కానీ అసలు ఎందుకు ఈ పార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చే అవసరం లేదని 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం మంచి పని చేసిందో చెప్పాలని అన్నారు 10 చాన్స్ లు ఇచ్చారు అయినా ఇప్పటికీ దేశానికి చేసిన మంచి ఎక్కడ కనిపించడం లేదు మళ్లీ మళ్లీ వారికి అవకాశం ఇవ్వటానికి ప్రజలు పిచ్చోళ్ళ ఏమైనా కనిపిస్తున్నారా అందుకే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పారు ఎలాంటి మంచి పని చేయకుండా ఇన్నాళ్లు దేశాన్ని బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కాదు ముందు ముందు కూడా కాంగ్రెస్ అసలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు..