చిన్న సినిమాగా విడుదలైన పాన్ ఇండియా లెవల్ ఘనవిజయం సాధించిన చిత్రం ‘కేజీఎఫ్’ ..ఈ మూవీలో రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి.
అయితే ఈ భామను ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాధించాయి.‘కేజీఎఫ్’ హీరో యష్ ఆమెను ఇబ్బంది పెట్టాడని కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విమర్శలపై సమాధానం చెప్పిందీ తార.
యష్ ఒక జెంటిల్మన్ అని, తననెప్పుడూ ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది. శ్రీనిధి శెట్టి తన తాజా సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ…‘కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసేందుకు, వదంతులు పుట్టించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు.
నేను ప్రేమను పంచేందుకు ఇదొక సాధనం అనుకుంటా. ‘యష్తో నటించేప్పుడు సెట్లో నాకెప్పుడూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆయన ఒక జెంటిల్మన్. అతనితో కలిసి నటించడాన్ని ఆస్వాదించాను’ అని శ్రీనిధి శెట్టి ఇచ్చిన స్పష్టతతో ఈ రూమర్స్కు చెక్ పెట్టినట్లయింది.