ఎప్పుడు ఏదోక వివాదంలో ఉండకపోతే తనకు నిద్రపట్టనట్లుంది బాలీవుడ్ వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా తన శత్రువులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న గురువారం ఈ బ్యూటీ తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూటీ కంగనా మాట్లాడుతూ ఇన్నేండ్ల నా జీవిత ప్రయాణంలో భాగమైన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువులు, స్వామి వివేకానందతోపాటు శత్రువులనూ గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ ‘నా శత్రువులు నన్ను విశ్రాంతి తీసుకోకుండా పనిచేసేలా చేసి నా విజయానికి కారణమయ్యారు. సమస్యలను ఎలా అధిగమించాలో, ఎలా పోరాడాలో నేర్పించారు. వారికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.