Home / MOVIES / జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ..బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్  చిత్రీకరణ జరుగుతున్నది.

తీవ్ర విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చావుకి, దేవుడికి భయపడని మృగాల్లాంటి మనుషులతో ఓ ధీరోదాత్తుడి పోరాటం ఏమిటన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం సందర్భంలో తెలిపారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంతో కనిపించనున్నారని తెలిసింది. కథానుగుణంగా భిన్న పార్శాల్లో ఈ పాత్రలు సాగుతాయని..ఆయన లుక్స్‌ కూడా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్‌ సంగీతాన్నందిస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat