పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మామాఅల్లుళ్లు నటించిన తాజా మల్టీ స్టారర్ చిత్రం ‘బ్రో’ . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదల కానుంది.
ఏపీలోని విశాఖలోని జగదాంబ థియేటర్లో సా.6.03 గంటలకు సాయిధరమ్ తేజ్ విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మల్టీ స్టారర్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం జూలై 28న రిలీజ్ కానుంది.