ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు.
మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేస్తూ ఇడుపులపాయ ఎగ్జిట్ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. బహిరంగ సభలో ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ “నా కసి ప్రస్తుతం అవినీతి ఆంధ్ర అభివృద్ధి ఆంధ్రగా మార్చడమే .నేను పోయిన తర్వాత నాన్న గారి ఫోటో పక్కన నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలన్నదే నా తాపత్రయం .ప్రతి ఇంట్లో అందరు ఆనందంగా ఉండాలి .ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలనే నా కసి అని అన్నారు .