తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఈ నెల పదిహేడో తారీఖున జరగాల్సింది వాయిదా పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి టీచర్స్,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మరో కొత్త తారీఖును తెలియజేస్తామని తెలిపింది.