ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రైతుల ఆపద్భాంధవుడని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ప్రపథమంగా కోటగిరి మండలం దోమలెడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ లాంటివి అంటూ సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు .ఇతర రాష్ర్టాల అధికారులు, నాయకులు వచ్చి మన రాష్ట్రంలోని అభివృద్ధిని చూసి పోతున్నారని మంత్రి తెలిపారు. స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లయినా ఇంకా పేదలకు సొంత ఇండ్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇదంతా గత ప్రభుత్వాల పాపమే అని వాపోయారు. గత ప్రభుత్వాల హయంలో నాయకులు స్వార్థంతో అవినీతిగా గడ్డి తిని దొంగలు దొంగలుగా ఊర్లు..ఊర్లు పంచుకున్నారన్నారు.
గత ప్రభుత్వాల హయంలో సబ్సిడీ ఇండ్ల పేరు మీద నాయకులే పంచుకున్నారని గుర్తు చేశారు. కూతురు, అల్లుడు పండుగకు ఇంటికి వస్తే ఇంట్లో స్థలం లేని పరిస్థితి ఉండేదన్నారు. దేశంలోనే పేదలకు అన్ని వసతులతో ఇండ్లు కట్టించే ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. యాదాద్రి డెవలప్మెంట్కు సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లను కేటాయించారని మంత్రి వెల్లడించారు. యాదాద్రిని తిరుపతిలా మార్చడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మంత్రి తెలియజేశారు. కాళేశ్వరం పూర్తయితే నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు.