హైదరాబాద్ ఓ అద్భుతమైన నగరమని ప్రధాని మోదీ అన్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ వికాసం కోసం భారత సర్కార్ ఎటువంటి లోటు రానివ్వదని మోదీ అన్నారు. వికాస్ యాత్రకు కేంద్ర సర్కార్ తోడుగా ఉంటుందని, తెలంగాణ సౌభాగ్యాన్ని మార్చేస్తామని ప్రధాని అన్నారు. భారతమాత సేవ కోసం తెలంగాణ బీజేపీ పరిశ్రమించిందన్నారు. దాని వల్లే బీజేపీ, దేశంలో పెద్ద పార్టీగా అవిర్భవించిందన్నారు. బీజేపీ కార్యకర్తలకు ఈ లాభం వెళ్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజంకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రాష్ర్టాల వికాసం కోసం, వాటి అభివృద్ధి కోసం, భారత ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.తనకు స్వాగతం పలికిన ప్రతి బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మరికాసేపట్లో మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభిస్తారు.
