ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని.. దిల్రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్. మొదట ఇది ఒక కాలేజీ లవ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని ఇటీవలే జరిగిన ఎంసీఏ చిత్రబృందం ఓ కార్యక్రమంలో వెల్లడించింది.
ఇందులో మిడిల్ క్లాస్ మరిది పాత్రలో కనిపించనున్నాడు నాని. నానికి వదినగా భూమిక కనిపించనుంది. వదిన ఆర్టీఓ అధికారిగా పనిచేస్తుందట. అయితే, నాని ఏమో గాలికి తిరుగుతుంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికే హైలెట్గా నిలుస్తాయని చెబుతోంది చిత్ర బృందం.
అయితే, తాజాగా ఎంసీఏ చిత్రం రిలీజ్పై గత కొన్ని రోజులుగా వస్తున్న వదంతులన్నీ పుకార్లేనని తేల్చేశారు నిర్మాత దిల్రాజు. ఇటీవల జరిగిన జవాన్ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న దిల్రాజు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఎంసీఏ సంక్రాంతికి వాయిదా పడిందన్న వదంతులు అవాస్తమని, ముందు అనుకున్నట్టుగానే డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్రాజు.
అదే విధంగా నాని, అఖిల్కు మధ్య బాక్సాఫీస్ వార్ అంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్కు స్పందించిన నేచురల్ స్టార్ నాని.. వార్ తనకు, అఖిల్కు కాదని, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్తో తామిద్దరం తలపడబోతున్నట్లు తెలిపారు. అయితే, సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై కూడా క్రిస్మస్కు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మిడిల్ క్లాస్ అబ్బాయ్ టైగర్ జిందా హైకి హలో చెప్తాడట! అంటూ మూడు చిత్రాల పేర్లు కలబోస్తూ ఓ ఫన్నీ రిప్లై ఇచ్చాడు నేచురల్ స్టార్ నాని.