ఇటీవలే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ సంచలన వాఖ్యలు చేశారు . రేవంత్ వెళ్లిపోవడం వల్లే టీటీడీపీ మూతపడుతోందన్న సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై అయన స్పందించారు .. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? అని అయన ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియామకం పార్టీలో తాత్కాలికంగా జరిగిన చిన్న పొరపాటు అని పేర్కొన్నారు. అసలు పార్టీలో రేవంత్కు అంతపెద్ద అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదన్నారు. మీడియా హైలెట్ చేయడం వల్లే రేవంత్కు గుర్తింపు వచ్చిందన్నారు. రేవంత్ అసలు లీడరే కాదన్న మోత్కుపల్లి.. సామాన్య ప్రజలతో మాట్లాడని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని వ్యక్తి నాయకుడెలా అవుతాడని ప్రశ్నించారు. లీడర్కు ఉండాల్సిన లక్షణాలు రేవంత్లో ఏమాత్రం లేవన్నారు.రేవంత్ వ్యవహారంపై చాలాసార్లు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.
