ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో మొత్తం 2018-19 బడ్జెట్ అంచనా రూ.21.57లక్షల కోట్లు, ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంటుందని అంచనా వేసారు. బడ్టెట్ లోని ముఖ్య అంశాలు
- రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేస్తాం.ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.1400 కోట్లు.ఆపరేషన్ గ్రీన్ కోసం రూ.500కోట్లు.
- పర్ఫ్యూమ్స్, ఆయిల్స్ కోసం రూ.200కోట్లు.
- గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2000కోట్లు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం.
- ఆలు,ఉల్లి ఉత్పత్తులు పెంచేందుకు ఆఫరేషన్ గ్రీన్
- వ్యవసాయం దేశంలో ప్రధాన రంగం. క్లస్టర్ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు. హార్టీకల్చర్కు ప్రాధాన్యం.
- కౌలు రైతులకూ రుణాలందించేలా చర్యలు
SEE ALSO : బ్రేకింగ్ : కేంద్రం సంచలన నిర్ణయం..!
- వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం.
- వ్యవసాయ మార్కెట్ ఫండ్ కు రూ.200 కోట్లు.అన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర
- 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నాం.
- డీబీటీ విజయవంతమైంది. లబ్ధిదారునికి వీలుగా రాయితీలు అందుతున్నాయి.
- సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నాం. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నాం.
- చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.3,790కోట్లు.
- 12వందల కోట్లతో పేదలకు ఆరోగ్య సౌకర్యం
- ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో రెండు కొత్త పథకాలు
- అన్ని కుటుంబాలకు జీవన బీయా యోజన.10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా
- గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఏకలవ్య పాఠశాలలు.ఉపాధ్యాయుల శిక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు
- ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోసం రెండు ప్రత్యేక విద్యాలయాలు
- నాలుగేళ్లలో లక్ష కోట్లతో విద్యాభివృద్ధికి రైజ్ పథకం
- ప్రతి మూడు పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఒక మెడికల్ కాలేజీ
- వెయ్యి మంది బీటెక్ విద్యార్థుల కోసం ప్రధాన మంత్రి రిసెర్చ్ ఫెల్లో పథకం
- మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కాలేజీలు, ఆస్పత్రులు
- తెలంగాణ గిరిజన వర్శిటీకి రూ.10 కోట్లు
- నమామీ గంగే పథకం కింద 47 కార్యక్రమాలు
- ఎస్సీ సంక్షేమ నిధికి 56 వేల 6 వందల 19 కోట్లు
- ఎస్టీ వెల్ఫేర్ కి 39 వేల 135 కోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6 కోట్ల మరుగుదొడ్లు
- వచ్చే ఏడాదిలో మరొక 2 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం
- పీఎం జీవన్ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి.
- జన్ధన్ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపు.
- దళిత సంక్షేమానికి కోసం రూ.56వేల కోట్లు. ఆదివాసీల సంక్షేమానికి రూ.32,508కోట్లు
- ఆరోగ్య రంగానికి 1.38లక్షల కోట్లు.
SEE ALSO : బడ్జెట్ : రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..!
- గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713కోట్లు.
- ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు.
- సౌభాగ్య పథకానికి రూ.16వేల కోట్లు
- ప్రతీ పౌరునికి సమీపంలో వెల్నెస్ సెంటర్లు… వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు.
- మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు రుణాలు
- జాతీయ జీవనోపాధి మిషన్ కు 5వేల 7వందల 50 కోట్లు
- క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600కోట్లు.
- ముద్ర యోజనకు మూడు లక్షల కోట్లు
- జౌళి రంగానికి ఏడు వేల 148 కోట్లు
- నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం కింద పదికోట్ల కుటుంబాలకు ప్రయోజనం
- విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు.
- 2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్ భారత్. ఆరోగ్య కేంద్రాలకు రూ.1200కోట్లు.
- బ్లాక్బోర్డు నుంచి డిజిటల్ బోర్డు: కార్యక్రమంలో భాగంగా డిజిటల్ విద్యా కేంద్రాలు.
- వ్యవసాయ రుణాలకు రూ.11లక్షల కోట్లు.
- గృహ నిర్మాణానికి ప్రత్యేక గృహనిర్మాణ నిధి. దేశవ్యాప్తంగా 55లక్షల గృహాల నిర్మాణానికి చర్యలు.
- 9వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లు నిర్మాణం.
- ప్రధానమంత్రి గ్రామసడక్ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం.
- 2022 వరకు అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణం
- ఉజ్వల యోజనలో భాగంగా 8కోట్లమంది గ్రామీణ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు.
SEE ALSO : 2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!
- ఢిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు
- మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు రూ.10,000కోట్లు. జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1,290కోట్ల కేటాయింపు.
- కిసాన్ క్రెడిట్ కార్డులను ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకు విస్తరిస్తాం.
- వ్యవసాయం దేశంలో ప్రధాన రంగం. క్లస్టర్ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు. హార్టీకల్చర్కు ప్రాధాన్యం.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15శాతం పెరుగుతాయి.
- రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నాం. వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం.
- సులభతర వాణిజ్యం విధానంలో ఆర్థికవృద్ధి వేగంగా జరుగుతుంది.
- సంస్థాగత సంస్కరణల్లో పేదలకు లబ్ధి. ఈ సంస్కరణలతో బలీయమైన ఆర్థికశక్తిగా భారత్.
- ప్రపంచంలో ఏడో ఆర్థికశక్తిగా ఎదిగాం. త్వరలోనే ఐదో ఆర్థికశక్తిగా భారత్ అవతరించనుంది.7.2-7.5 జీడీపీ ఎదుగుదల ఉంటుంది.
- పన్నుల విధానం జీఎస్టీలో సులభతరమైంది. పెద్దనోట్ల రద్దులో భారీగా ధనం వినియోగంలోకి వచ్చింది
- రైల్వే విద్యుద్ధీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం
- అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై,సీసీ కెమెరాల ఏర్పాటు
- ప్రాంతీయ విమానయానంలో 56 ఎయిర్ పోర్టులు
SEE ALSO : పవన్ కల్యాణ్, పార్వతీ మెల్టన్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!!
- రాష్ట్రపతి వేతనం 5 లక్షలకు పెంపు
- ఉపరాష్ట్ర పతి వేతనం 4 లక్షలకు పెంపు
- గవర్నర్ల వేతనాలు 3 లక్షల 50 వేలకు పెంపు
- ఏప్రిల్ 1 నుంచి ఎంపీ వేతనాలు పెంపు
- ఎంపీల జీతం ఐదేళ్లు ఒకసారి పెంచేందుకు రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు
- స్మార్ట సిటీల్లో ప్రతి ఇంటికి తాగునీరు
- 2017-18లో ద్రవ్యలోటు అంచనా జీడీపీలో 3.5శాతం
- 2017-18 సవరించిన బడ్జెట్ రూ.21.54లక్షల కోట్లు
- వేతన ఉద్యోగులకు రూ.40వేల స్టాండర్డ్ డిడక్షన్.
- పింఛన్దారులకూ వర్తింపు… 2.5కోట్లమందికి లబ్ధి.
- 2018-19 బడ్జెట్ అంచనా రూ.21.57లక్షల కోట్లు. ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంటుందని అంచనా
- వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
- చిన్న తరహా పాదరక్షలు, తోలు ఉత్పతుల తయారీ సంస్థల లాభాలపై ఆదాయ పన్ను రాయితీ
- సహకార సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక సంస్థలకు వందశాతం పన్ను రాయితీ.
- సైనిక సంపత్తి, ఆయుధాల తయారీలో స్వావలంబనకు ప్రయత్నం. ఆయుధాల తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం.
- అమృత్ పథకం కింద రూ.19,428 కోట్లతో 494 ప్రాజెక్టులు
- ప్రత్యక్ష పన్నుల్లో 12.6శాతం వృద్ధి. రెండేళ్లుగా ఆదాయపన్ను వసూళ్లలో భారీ పెరుగుదల
- దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 85.51కోట్లు. 40శాతానికి పెరిగిన పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య
- వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుల కింద అదనంగా రూ.90వేల కోట్ల సేకరణ
- ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ వాటాను మూడేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.అన్ని రంగాలలోని ఉద్యోగులకూ వర్తిస్తుంది
- మహిళా ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ వాటా కింద తమ వేతనాల్లోంచి చెల్లిస్తున్న వాటా 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గింపు
- దిగుమతి చేసుకున్న మొబైల్ ధరలు పెరగనున్నాయి.15 శాతం ఉన్న ధరలు 20 శాతానికి పెరగనున్నాయి
- సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులకు పన్ను రాయితీ లక్ష రూపాయిల పెంపు.ప్రస్తుతం 60 వేల రూపాయిలుగా ఉన్న రాయితీని లక్షకు పెంపు
- ప్రయాణ, వైద్య ఖర్చులకు 40 వేల వరకూ పన్ను రాయితీ.ప్రయాణ వైద్య ఖర్చులకు 40 వేల రూపాయిలకు స్టాండర్డ్ డిడక్షన్ను వర్తింపు
- ఆంధ్రప్రదేశ్ లో ఐఐటీ కి రూ. 50 కోట్లు.కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, నిట్ కు 57 కోట్లు.ట్రిపుల్ ఐటీకి 30, ఐఐఎస్ సీఆర్ కు 49 కోట్లు కేటాయింపు.గిరిజన విశ్వవిద్యాలయానికి 20 కోట్లు, ఐఐఎం కు 42 కోట్లు
SEE ALSO : బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..!
SEE ALSO : సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత …