ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం స్థానం దక్కకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో టీడీపీ నేతలతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే ఆయనతో జరిగిన సమావేశం ఫలితం లేకపోవడంతో..పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగుతాయని టీడీపీ ఎంపీలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పీఎంవో నుంచి టీడీపీ నేతలకు ఆహ్వానం వెళ్లింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మరో నలుగురు ఎంపీలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధానికి మరోసారి వివరించనున్నారు.
see also : 2019 అధికారం ఎవరిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చి చెప్పిన మరో జాతీయ సర్వే..!!
see also : దేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన రాజకీయా నాయకుడు చంద్రబాబు