ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన ఒక విస్తృత స్ధాయి సమావేశాన్ని సైతం నిర్వహించారు.
ఈ సందర్బంగా వివిధ దేశాల నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డలు, నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మంత్రి కోరుతూ వస్తున్నారు. ప్రవాస భారతీయుల కోసం చేపట్టాల్సిన చర్యలపైన వివిధ రాష్ర్టాల్లోని అత్యుత్తమ విధానాలను ఏన్నారై శాఖ అధ్యయనం చేసింది. ఈ సారి బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించడంతో ప్రవాస తెలంగాణ వాసుల అభివృద్ధి, సంక్షేమానికి నూతన కార్యక్రమాలను ప్రవేశ పేట్టే అవకాశం ఉన్నది.
మంత్రి కెటి రామారావు భాద్యతలు తీసుకున్నాక టెక్స్ టైల్ శాఖకు గత ఏడాది చరిత్రలో ఏన్నడు లేనంతగా వెయ్యికోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి నేతన్నలకు అనే సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెస్తున్నది. ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడే అవకాశం ఉన్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఏన్నారై శాఖ బడ్జెట్ కేవలం రు 5 కోట్లు ఉండేది.