గతంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని వరికోల్ గ్రామాన్ని ప్రత్యేక రాష్టంలోనైన అభివృద్ధి చేసుకోవాలని స్థానికుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తలచారు .కన్నా ఊరిపై ఉన్న మమకారంతో శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు నడుంకట్టారు .ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఉపఎన్నికల్లో వరికోల్ గ్రామాన్ని ఏకతాటి పైకి తీ సుకొచ్చి గ్రామంమంతా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటే సేల కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వరికోల్ గ్రామానికి ఆకర్షితులు అయ్యారు.
see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ
అంతేకాకుండా రాష్ట్రంలోని మంత్రులు ,పార్లమెంట్ సభ్యులతో పాటు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,ఎంపీ కవిత కూడా వరికోల్ గ్రామాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వారు గ్రామా అభివృద్ధి కి వరాల జల్లు కురుపించారు.ఈ క్రమంలోనే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక శ్రద్ద,గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది.అందులోభాగంగానే వరికోలుకు పులిగిల్ల గ్రామాలకు మధ్య 3.10కిలోమీటర్ల రోడ్డును వెడల్పు చేస్తూ డబుల్ లేన్ బీటీ రోడ్డుగా మార్చేందుకు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో రూ.5.75 కోట్లు మంజూరు చేయి౦చారు.
see also:దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం….మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ,ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,మంత్రి ఈటల రాజేందర్ ,స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తమవంతు సహకారాన్ని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికీ అయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారి మజురు చేయించడం పై వరికోల్ గ్రామా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు.