ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ ప్రజలు వైఎస్ జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రలో జగన్ కు మద్దతుగా మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారు.
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో చేరారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, వారికి ఓదార్పు, ధైర్యాన్నిచ్చేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయ్రాతకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ మంచి ఆదరణ లబిస్తుందని తెలిపారు.
నేడు రాజకీయ పదవులు కూడా వ్యాపారంగా మారిపోయాయని ఆయన ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడే తన లాంటివారిని, తెలుగుదేశం ఎమ్మెల్యేలు శాసన మండలిలో లేకుండా ఉండేలా చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు, వైసీపీ ని గెలిపించేదుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.