వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్ఛాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని ఆపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కానీ ఇచ్చాపురంలో అసలు జనమేలేరని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారని సోమిరెడ్డి గనుక నిన్న సభకు వచ్చిఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా విమర్శించారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో ప్రస్థానంలా జగన్ పాదయాత్ర సాగిందనిన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ నేడు స్వామివారి దర్శనం కోసం తిరుమల రావడం సంతోషకరమన్నారు. మరోవైపు తిరుమలకు జగన్ కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.