ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు అన్నట్లుగా టీడీపీవ వేస్తున్న ఎత్తులు విఫలమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీ పరువు పోగుట్టుకుంటోంది. జిల్లాలోని రాజంపేట టీడీపీ రాజకీయం చీలిపోయింది. వైసీపీలో గెలిచి టీడీపీలో మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గ్రూపులుగా చీలిపోయి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీంఓత నియోజకవరగ్ంలో అసలేం జరుగతోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఆర్ అండ్ బి గెస్ట్హౌస్ దగ్గర తన అనుచరులతో ఎమ్మెల్యే మేడా రహస్య మంతనాలు జరుపుతున్నారు.మేడా శాసనసభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే తనను టీడీపీ నుంచి బయటకు పంపేందుకే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే మేడా అంటున్నారు. కాగా ఈ ఎపిసోడ్తో పార్టీత పరువు పోతోందని పలువురు టీడీపీ నేతలు వాపోతున్నారు.