Home / ANDHRAPRADESH / వైసీపీలోకి చల్లపల్లి నరసింహారెడ్డి..!!

వైసీపీలోకి చల్లపల్లి నరసింహారెడ్డి..!!

మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న౦దున ఏపీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న…రాయలసీమ బీజేపీలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న చల్లపల్లి నరసింహారెడ్డి  వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.ఈ మేరకు నరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు  పావులు కలుపుతున్నారు .

కాగా మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో నరసింహారెడ్డి కి బలమైన క్యాడర్ ఉంది. గత వారం రోజులుగా చల్లపల్లి నరసింహారెడ్డి బీజేపీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నరసింహారెడ్డి ఖండించనూలేదు, ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా దేశాయ్ తిప్పారెడ్డి ఉన్నారు.ఈ క్రమంలో ఈ సారికూడా  దేశాయ్ తిప్పారెడ్డి కే  వైసీపీ టికెట్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో నరసింహారెడ్డికి టికెట్ దక్కకపోవచ్చని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat