ఏపీలో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసు దర్యాప్తును సిట్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంచార్జ్గా వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉంటారు. స్టీఫెన్ రవీంద్రతో పాటు సిట్ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నారాయణపేట ఎస్డీపీవో శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ప్రసాద్రావు, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రమేశ్, వెంకట్రామిరెడ్డి సభ్యులుగా ఉంటారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలోనే సిట్కు ప్రత్యేక చాంబర్ను ప్రభుత్వం కేటాయించింది.
